Rakshabandhan: సీఎం కేసీఆర్ ఇంట రక్షాబంధన్ సందడి... ఫొటోలు పంచుకున్న కేటీఆర్ తనయుడు

  • నేడు రాఖీ పౌర్ణమి
  • సీఎం కేసీఆర్ కు రాఖీ కట్టిన సోదరి
  • రాఖీలు కట్టించుకున్న కేటీఆర్, హిమాన్షు
  • సందడి చేస్తున్న ఫొటోలు
Rakshabandhan celebrations at CM KCR residence

దేశవ్యాప్తంగా రక్షాబంధన్ కోలాహలం నెలకొంది. అన్నాచెల్లెళ్ల ఆత్మీయతను ప్రతిబింబించే ఈ పండుగను నేడు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసంలోనూ రాఖీ పండుగ సందడి కనిపించింది. కేసీఆర్ కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టి ఆశీస్సులు అందుకున్నారు. మంత్రి కేటీఆర్, ఆయన తనయుడు హిమాన్షు కూడా రాఖీలు కట్టించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అక్కడే ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

More Telugu News