MAA: ‘మా’ సభ్యులకు మంచు విష్ణు వీడియో సందేశం

  • త్వరలోనే శాశ్వత భవనం
  • మూడు స్థలాలు చూశాను
  • చర్చించి ఒక స్థలాన్ని ఎంపిక చేద్దాం
Manchu Vishnu Posted A Video Message For MAA Members

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలపై ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. తాను పోటీ చేస్తున్నానని మంచు విష్ణు ప్రకటించిన వెంటనే ప్రకాశ్ రాజ్ బరిలోకి దిగారు. ఆ తర్వాత జీవిత, హేమ, నరసింహారావులు తమ అభ్యర్థిత్వాలను ప్రకటించుకున్నారు. దీంతో ఇప్పుడు ఐదుగురు ఆ పదవి కోసం పోటీ పడుతున్నారు.

అయితే, తాజాగా మంచు విష్ణు ‘మా’కు సంబంధించి ఓ వీడియో మెసేజ్ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల నాటి ‘మా’ కల త్వరలోనే నెరవేరుతుందని ఆయన చెప్పారు. ‘మా’కు శాశ్వత భవనం ఉండాలన్నది అసోసియేషన్ సభ్యులందరి కల అని, అందుకోసం ఓ మూడు స్థలాలను చూసొచ్చానని ఆయన చెప్పారు. అసోసియేషన్ తో చర్చించి ఆ మూడు స్థలాల్లోను ఒకటి ఎంపిక చేసి, దాంట్లో భవనం నిర్మిస్తామని తెలిపారు. కార్ లో వెళుతూ ఇచ్చిన ఆ వీడియో సందేశాన్ని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

More Telugu News