Telangana: తెలంగాణ గవర్నర్ తమిళిసైకి మాతృవియోగం

  • నిన్న అస్వస్థతకు గురైన గవర్నర్ తల్లి
  • ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స
  • ఫలించని వైద్యుల ప్రయత్నాలు
Telangana Governor Tamilisai Mother passed away

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణకుమారి  కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. నిన్న ఒక్కసారిగా అస్వస్థతకు గురైన కృష్ణకుమారిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడామెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. విషయం తెలిసిన పలువురు ప్రముఖులు గవర్నర్‌కు సంతాపం తెలిపారు.

More Telugu News