Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లోని గురుద్వారాలో చిక్కుకుపోయిన వందలాది మంది సిక్కులు

More than 200 Sikhs stuck in Afghanistan Gurudwara
  • గురుద్వారాలో చిక్కుకున్న 200కు పైగా సిక్కులు
  • వారిని సురక్షితంగా రప్పించాలని విదేశాంగ మంత్రికి విన్నపం
  • చేతనైనంత సాయం చేసేందుకు తాము సిద్ధమని వ్యాఖ్య
ఆప్ఘనిస్థాన్ ను తాలిబన్లు చేజిక్కించుకున్న తర్వాత ఆ దేశం నుంచి బయట పడేందుకు అక్కడి ప్రజలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో తాలిబన్ల కిరాతక పాలనను గుర్తు తెచ్చుకుని హడలిపోతున్నారు. కాబూల్ విమానాశ్రయం రన్ వేలపై వేలాది మంది గుమికూడారు. మరోవైపు ఆఫ్ఘన్ లోని ఓ గురుద్వారాలో 200 మందికి పైగా సిక్కులు చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు.

ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను వెంటనే సురక్షితంగా వెనక్కి రప్పించాలని భారత విదేశాంగమంత్రి జైశంకర్ ను అమరీందర్ కోరారు. ఈ విషయలో చేతనైనంత చేసేందుకు తమ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని చెప్పారు. మరోవైపు నిన్న అమరీందర్ స్పందిస్తూ, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మనకు ఎంతమాత్రం మంచివి కావని... సరిహద్దుల్లో అదనపు నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని కేంద్రానికి సూచించారు.
Afghanistan
Sikhs
Gurudwara
Punjab
Amarinder Singh

More Telugu News