CBI: ఝార్ఖండ్ జడ్జి హత్య కేసులో సమాచారం అందిస్తే రూ.5 లక్షల నజరానా

  • ఝార్ఖండ్ లో జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య
  • ఆటోతో ఢీకొట్టిన దుండగులు
  • ఈ కేసును సీబీఐకి అప్పగించిన ప్రభుత్వం
  • రివార్డు ప్రకటన జారీ చేసిన సీబీఐ
CBI announces cash reward on Judge Uttam Anand murder case

ఇటీవల ఝార్ఖండ్ లో ధన్ బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ ను ఉద్దేశపూర్వకంగా ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. న్యాయవర్గాలను ఈ ఘటన తీవ్ర ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఈ కేసులో ఝార్ఖండ్ సర్కారు తొలుత సిట్ ఏర్పాటు చేసినా, ఆపై ఈ కేసును సీబీఐకి అప్పగించింది. కాగా, ఈ కేసులో కీలక సమాచారం అదించిన వారికి సీబీఐ నజరానా ప్రకటించింది.

జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్యకు సంబంధించిన సమాచారాన్ని తమ కార్యాలయానికి వచ్చి తెలియజేయాలని, దర్యాప్తుకు ఉపయోగపడే సమాచారం అందిస్తే రూ.5 లక్షల రివార్డు ఇస్తామని సీబీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. సమాచారం అందించిన వారి వివరాలు ఎంతో రహస్యంగా ఉంచుతామని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్ట్ చేసినా, దర్యాప్తు ఏమాత్రం ముందుకు కదల్లేదు. దాంతో నజరానాపై కరపత్రాలు, వాల్ పోస్టర్లు ముద్రించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

More Telugu News