Team India: లార్డ్స్ టెస్టు: రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా

  • లార్డ్స్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
  • 83 పరుగులు చేసి అవుటైన రోహిత్ శర్మ
  • నిరాశ పరిచిన పుజారా
  • రెండు వికెట్లు సాధించిన ఆండర్సన్
Team India lost two wickets in Lords test

లార్డ్స్ టెస్టులో భారత్ మూడో సెషన్ సమయానికి 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 83 పరుగులు చేసి జేమ్స్ ఆండర్సన్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. 145 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 11 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. సెంచరీ దిశగా వెళుతున్నాడన్న తరుణంలో ఆండర్సన్ బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. ఇక వన్ డౌన్ లో వచ్చిన ఛటేశ్వర్ పుజారా కేవలం 9 పరుగులకే అవుటయ్యాడు. ఈ వికెట్ కూడా ఆండర్సన్ ఖాతాలోకే చేరింది.

ప్రస్తుతం భారత్ స్కోరు 53 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధసెంచరీ పూర్తిచేసుకుని 55 పరుగులతో ఆడుతున్నాడు. అతడికి జతగా కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలో దిగాడు.

More Telugu News