Andhra Pradesh: ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ప్రారంభమైన ఏపీ కేబినెట్ భేటీ

ap cabinet meets
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం వైఎస్‌ జగన్ నేతృత్వంలో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభ‌మైంది. ఈ సమావేశంలో కీల‌క అంశాల‌పై నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. నవరత్నాల పథకాల అమ‌లు,  జగనన్న విద్యాకానుక, నాడు-నేడు, శాటిలైట్‌ ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ స్కూళ్లు, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్ల ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చిస్తున్న‌ట్లు స‌మాచారం.  

అలాగే,  నెల 10న అమలు చేయనున్న వైఎస్ఆర్‌ నేతన్న నేస్తం పథకంపై కూడా చర్చిస్తున్నారు. ఏపీలో పోలవరం నిర్వాసితుల ఆర్‌అండ్ఆర్‌ చెల్లింపులకు ఈ స‌మావేశంలో ఆమోద ముద్ర వేయ‌నున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ పై కూడా నిర్ణ‌యాలు తీసుకుని కేబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది.

అలాగే, ధార్మిక పరిషత్ కార్యనిర్వాహక కమిటీ ఏర్పాటుపై చట్ట సవరణకు ఆమోదం తెలపనుంది. . రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనోత్పత్తి విధానం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల రివైజ్డ్‌ అంచనాలకు ఆమోద ముద్ర వేయ‌నుంది. వీటితో పాటు మ‌రిన్ని కీల‌క అంశాల‌పై కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం వుంది.
Go Back to Shorts
Andhra Pradesh
AP Cabinet
Jagan

More Telugu News