Trent Bridge: ట్రెంట్ బ్రిడ్జ్ లో వెలుతురు లేమితో నిలిచిన ఆట... అప్పటికే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా

  • ట్రెంట్ బ్రిడ్జ్ లో టీమిండియా, ఇంగ్లండ్ తొలిటెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో 183 రన్స్ చేసిన ఇంగ్లండ్
  • భారత్ కు శుభారంభం
  • ఆపై వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన వైనం
Bad light stops play in Trent Bridge test

ట్రెంట్ బ్రిడ్జ్ లో టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు వెలుతురు లేమి కారణంగా నిలిచిపోయింది. ఆట ఆగిన కాసేపటికే వరుణుడు కూడా ప్రత్యక్షమయ్యాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లకు 125 పరుగులు చేసిన స్థితిలో వెలుతురు లేమితో మ్యాచ్ ను నిలిపివేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. అప్పటికి క్రీజులో ఓపెనర్ కేఎల్ రాహుల్ 57, రిషబ్ పంత్ 7 పరుగులతో ఆడుతున్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేయగా, ఆ స్కోరుకు భారత్ ఇంకా 58 పరుగులు వెనుకబడి ఉంది.

ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్ కు 2, ఓల్లీ రాబిన్సన్ కు ఓ వికెట్ దక్కాయి. ఓపెనర్ రోహిత్ శర్మ 36 పరుగులు చేయగా, వన్ డౌన్ లో వచ్చిన పుజారా 4 పరుగులకే వెనుదిరిగాడు. ఆపై కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ కావడంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ఆదుకుంటాడనుకున్న అజింక్యా రహానే 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ కావడంతో భారత్ కష్టాలు రెట్టింపయ్యాయి.

More Telugu News