Karimnagar District: వ్య‌వ‌సాయ బావిలో ప‌డిపోయిన కారు.. అందులో ఐదుగురు?

  • కరీంనగర్ జిల్లాలోని చిన్న ముల్కనూరులో ఘ‌ట‌న‌
  • గుర్తించిన స్థానికులు
  • కారును బ‌య‌ట‌కు తీసేందుకు పోలీసుల‌ ప్ర‌య‌త్నాలు

కరీంనగర్ జిల్లాలోని చిన్న ముల్కనూరు మీదుగా ప్ర‌యాణిస్తోన్న‌ ఓ కారు ఒక్క‌సారిగా అదుపుత‌ప్పి అక్క‌డి వ్య‌వ‌సాయ‌ బావిలో పడిపోయింది. ఈ విష‌యాన్ని గుర్తించిన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు కారును బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నారు.

కరీంనగర్ నుండి  కారు హుస్నాబాద్ వెళ్తుండగా చిన్న ముల్కనూరు వద్ద ఈ ప్ర‌మాదం చోటు చేసుకుందని వివ‌రించారు. ఆ కారులో ఐదుగురు ఉన్న‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. కారు బావిలో ప‌డి అప్పటికే చాలా సమ‌యం కావ‌డంతో వారి పరిస్థితిపై ఆందోళ‌న నెల‌కొంది. ఘటనా స్థ‌లిలో సహాయక చర్యలు కొన‌సాగుతున్నాయి.

More Telugu News