టీమిండియా, శ్రీలంక మూడో వన్డేకు వర్షం అంతరాయం
- కొలంబోలో నేడు మూడో వన్డే
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- 23 ఓవర్లలో 3 వికెట్లకు 147 పరుగులు
- వర్షం రావడంతో మ్యాచ్ నిలిపివేత
అంతకుముందు, ఓపెనర్ పృథ్వీ షా 49 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 49 పరుగులు చేయగా, కెప్టెన్ శిఖర్ ధావన్ 13 పరుగులు చేసి చమీర బౌలింగ్ లో అవుటయ్యాడు. కెరీర్ లో తొలి వన్డే ఆడుతున్న సంజు శాంసన్ 46 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 46 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో దుష్మంత చమీర, ప్రవీణ జయవిక్రమ, కెప్టెన్ దసున్ షనక తలో వికెట్ తీశారు.