'చిన్నారి పెళ్లికూతురు' ఫేమ్ సురేఖ సిఖ్రి మృతి
- కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలు
- నిన్న గుండెపోటు
- 'చిన్నారి పెళ్లికూతురు'తో తెలుగువారికీ పరిచయం
సురేఖ సిఖ్రి 1988లో 'కిస్సా కుర్సి కా' సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించారు. మమ్మో, బధాయ్ హో సినిమాలకు ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తెలుగులోకి డబ్ అయిన తర్వాత సురేఖ సిఖ్రి తెలుగు వారికి కూడా బాగా దగ్గరయ్యారు. సురేఖ సిఖ్రి చివరిసారిగా ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్ అనే సినిమాలో నటించారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.