AP POLYCET 2021: ఏపీ పాలిసెట్ నిర్వహణకు ఏర్పాట్లు.. సెప్టెంబరు మొదటి వారంలో పరీక్షలు!

  • పదో తరగతి ఫలితాలు వెల్లడించిన అనంతరం ప్రకటన
  • ప్రతిపాదనలు పంపిన సాంకేతిక విద్యాశాఖ
  • ఈసారి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం
AP govt ready to conduct polycet in september

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పాలిసెట్‌ను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబరు మొదటి వారంలో నిర్వహించాలని నిర్ణయించినా తేదీలను ఇంకా ఖరారు చేయలేదు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులందరూ ఉత్తీర్ణులు అయినట్టు ప్రకటించిన ప్రభుత్వం త్వరలోనే ఫలితాలను ప్రకటించనుంది. అనంతరం పాలిసెట్‌పై ప్రకటన చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పాలిటెక్నిక్‌కు బోధన రుసుముల చెల్లింపు సదుపాయం ఉండడంతో దరఖాస్తులు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

More Telugu News