Damodara Rajanarsimha: కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలో అపశ్రుతి... ఎడ్లబండి నుంచి కిందపడిన రాజనర్సింహ

  • దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
  • మెదక్ లో కాంగ్రెస్ నేతల నిరసన
  • పాల్గొన్న రాజనర్సింహ
  • ఓ ఎడ్లబండిపై ప్రసంగం.. బెదిరిన ఎడ్లు
Congress leader Rajanarsimha slips off from a cart

దేశంలో చమురు ధరలు పెంచడంపై నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మెదక్ లో నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ధర్నాచౌక్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నేత గీతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అయితే, ఈ నిరసన కార్యక్రమాల్లో ఎడ్లబండ్లను కూడా ప్రదర్శనకు తీసుకువచ్చారు. ఓ ఎడ్లబండి పైనుంచి రాజనర్సింహ ప్రసంగిస్తుండగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఎడ్లు ఒక్కసారిగా బెదరడంతో బండి కుదుపులకు గురై, బండిపై ఉన్న రాజనర్సింహ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మోకాలికి దెబ్బతగలడంతో వైద్యులు చికిత్స అందించారు.

More Telugu News