తొమ్మిది మంది సింహాచలం ఆలయ వైదికులకు షోకాజ్ నోటీసులు
- గత జ్యేష్ట ఏకాదశి రోజున స్వామి వారికి కల్యాణోత్సవం
- గరుడ గజ్జన పాటను ఆలపించిన అర్చకులు
- మార్ఫింగ్ చేసిన వైదికులు
మరోవైపు తాను మార్ఫింగ్ చేసి ఇన్చార్జి ప్రధాన అర్చకుడికి పంపినట్టు ఇప్పటికే ఒక వేద పండితుడు అధికారుల వద్ద ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైదికులందరినీ అధికారులు విచారిస్తున్నారు. వీరు ఇచ్చే సమాధానాల ఆధారంగా... వీరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఈవో సూర్యకళ మాట్లాడుతూ, ఇకపై ఆలయ దర్శనాలపై కఠిన నిబంధనలు అమలవుతాయని చెప్పారు. ఉద్యోగులు కూడా దర్శనం టికెట్ తీసుకోవాల్సిందేనని అన్నారు.