రేపు తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాలు వెల్లడి

Telangana Inter second year results will be out tomorrow
  • తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్
  • ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు
  • మార్కుల వెల్లడికి విధివిధానాలు ఖరారు
  • రేపు ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సబితా
కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఇంటర్ సెకండియర్ ఫలితాలను ఏ విధంగా ఇవ్వాలన్నదానిపై ఇటీవల విధివిధానాలు రూపొందించారు. ఈ మేరకు రేపు ఇంటర్ సెకండియర్ ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఫస్టియర్ లో సంబంధిత సబ్జెక్టుల్లో ఎన్ని మార్కులు వచ్చాయో, సెకండియర్ లోనూ ఆ సబ్జెక్టులకు అన్నే మార్కులు ఇవ్వనున్నారు. ప్రాక్టికల్స్ కు మాత్రం ఫుల్ మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఫెయిలైన సబ్జెక్టులకు పాస్ మార్కులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ విద్యార్థులు ఫలితాలతో సంతృప్తి చెందకపోతే, కరోనా పరిస్థితులు సద్దుమణిగాక వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తారు.
Go Back to Shorts
Intermediate
Second Year
Results
Telangana
Corona Pandemic

More Telugu News