Tollywood: ఇక‌పై నేను న‌టించ‌ను: 'నువ్వు-నేను' హీరోయిన్ అనిత

  • కుమారుడి సంర‌క్ష‌ణ‌కు ప్రాధాన్యం ఇస్తా
  • సినిమాలు, సీరియల్స్‌కు దూరంగా ఉంటా
  • భవిష్యత్తులో న‌టించే విషయాన్ని కూడా ఇప్ప‌ట్లో చెప్ప‌లేను
i dont act again says anita

తాను త‌న కుమారుడికి జన్మనిచ్చిన అనంత‌రం సినీ ప‌రిశ్ర‌మ‌కు దూరం కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని నువ్వు-నేను హీరోయిన్ అనిత చెప్పింది. ప్రస్తుత  పరిస్థితుల్లో త‌న కుమారుడి సంరక్షణ చూసుకోవడం త‌నకెంతో అవసరమ‌ని తెలిపింది. ఇక‌పై తాను సినిమాలు, సీరియల్స్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నానని స్ప‌ష్టం చేసింది.

అలాగే,  భవిష్యత్తులో తిరిగి సినిమాలు, సీరియ‌ళ్ల‌లో న‌టిస్తానా?  లేదా? అనే విషయాన్ని కూడా తాను ఇప్ప‌ట్లో చెప్ప‌లేన‌ని తెలిపింది. తాను ఇప్పుడు కొన్ని కమర్షియల్‌ యాడ్స్‌లో పనిచేస్తున్నానని చెప్పింది. కాగా, అప్ప‌ట్లో ఉద‌య్ కిర‌ణ్ హీరోగా న‌టించిన నువ్వు-నేను సినిమాలో హీరోయిన్‌గా అనిత న‌టించి మెప్పించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆమె ప‌లు సినిమాల్లో న‌టించింది. నాగిని సీరియ‌ల్ లోనూ న‌టిస్తోంది. ఆమె పారిశ్రామికవేత్త రోహిత్‌ను 2013లో ప్రేమించి, పెళ్లి చేసుకుంది.

More Telugu News