Bank Timings: ఏపీలో రేపటి నుంచి ఈ నెల 20 వరకు బ్యాంకు పనివేళల్లో మార్పు

  • మారనున్న బ్యాంకుల పనివేళలు
  • ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు అనుమతి
  • ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా వేళల్లో సవరణ
  • సాయంత్రం 5 గంటల వరకు పరిపాలన కార్యకలాపాలు
Bank timings in AP changed

ఏపీలో రేపటి నుంచి బ్యాంకు పనివేళలు మారనున్నాయి. రాష్ట్రంలో రేపటి నుంచి జనజీవన కార్యకలాపాలకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అనుమతించనున్నారు. ఈ నెల 20 వరకు ఈ తాజా వేళలు అమల్లో ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు పనివేళలను అందుకు అనుగుణంగా సవరించారు.

బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. అయితే, బ్యాంకుల సిబ్బంది తమ పరిపాలనా విధుల నిమిత్తం సాయత్రం 5 గంటల వరకు బ్యాంకుల్లోనే ఉండనున్నారు. ఈ మేరకు బ్యాంకుల పనివేళల్లో ఎస్ఎల్ బీసీ సమావేశంలో నిర్ణయించారు. ఏపీలో జూన్ 20 వరకు కర్ఫ్యూ పొడిగించిన సంగతి తెలిసిందే.

More Telugu News