kotaiah: ఆనంద‌య్య మందు వేసుకోగానే కోలుకున్నాన‌ని చెప్పిన కోట‌య్య మృతి!

  • ఇటీవ‌ల ఆనందయ్య మందు వేసుకున్న కోట‌య్య‌
  • అనంత‌రం ఆయ‌న చేసిన‌ వ్యాఖ్య‌లు వైర‌ల్
  • మ‌ళ్లీ అనారోగ్యం పాలైన రిటైర్డ్ హెడ్‌మాస్ట‌ర్
  • ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి
kotaian dies in hospital

కృష్ణపట్నంలో కరోనాకు మందు ఇస్తున్నార‌ని తెలుసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య కొన్ని రోజుల క్రితం ఆ మందు వేయించుకున్న విష‌యం తెలిసిందే. ఎన్ని ఆసుప‌త్రులు తిరిగినా మెరుగుప‌డ‌ని త‌న ఆరోగ్యం ఆనంద‌య్య మందు వేసుకోగానే నిమిషాల్లో మెరుగుప‌డింద‌ని ఇటీవ‌ల‌ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో బాగా వైర‌ల్ అయింది.

అయితే, అనంత‌రం మ‌ళ్లీ అనారోగ్యం పాలైన కోటయ్య జీజీహెచ్‌లో చికిత్స పొందారు. చివరికి ఆరోగ్యం విష‌మించ‌డంతో ఆయన మృతి చెందారు. కంట్లో చుక్కలు వేసుకున్న వారం రోజుల అనంత‌రం కోటయ్య ఆరోగ్యం క్షీణించడంతో, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనను చేర్చారు.

అనంత‌రం పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం ఈ నెల 22న‌ నెల్లూరు జీజీహెచ్‌కి తరలించగా అప్ప‌టి నుంచి ఆయ‌న‌ అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. మ‌రోవైపు, ఆనంద‌య్య మందు కోసం ఇప్ప‌టికీ జ‌నాలు కృష్ణప‌ట్నం వ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణ‌ప‌ట్నంలో 144 సెక్ష‌న్ విధించారు.

More Telugu News