Chiranjeevi: కరోనాతో మృతి చెందిన తన కారవాన్ డ్రైవర్ కుటుంబానికి చిరంజీవి ఆర్థికసాయం

  • గత నెలలో చిరు కారవాన్ డ్రైవర్ మృతి
  • దిగ్భ్రాంతికి గురైన చిరంజీవి
  • డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయం
  • తాజాగా రూ.1 లక్ష ఆర్థికసాయం అందజేత
Chiranjeevi helps his caravan driver family

మెగాస్టార్ చిరంజీవి కారవాన్ డ్రైవర్ కిలారి జయరామ్ గత నెలలో కరోనాతో మృతి చెందాడు. చాలాకాలంగా తన వద్ద పనిచేస్తున్న డ్రైవర్ మరణించడంతో చిరంజీవి తీవ్ర విచారానికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో, తన కారవాన్ డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు. తాజాగా కిలారి జయరామ్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థికసాయం అందించారు. ఈ మేరకు చెక్కును ఆలిండియా చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు డ్రైవర్ కిలారి జయరామ్ కుటుంబసభ్యులకు అందించారు.

More Telugu News