DRDO: ఈ నెల 27న రెండో విడత కరోనా ఔషధం 2డీజీ పంపిణీ!

  • నేడు మార్కెట్‌లోకి విడుదల చేసిన రాజ్‌నాథ్‌ సింగ్‌
  • తొలి విడతలో 10 వేల డోసుల పంపిణీ
  • వేగంగా కోలుకోవడానికి సహకరిస్తుందన్న డీఆర్‌డీఓ
  • రెగ్యులర్ ఉత్పత్తి జూన్‌లో ప్రారంభం
  • వెల్లడించిన డీఆర్‌డీఓ ఛైర్మన్‌ సతీశ్‌ రెడ్డి
drdos corona drug will be distributed on 27th of this month again

డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19  ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) ఈరోజు మార్కెట్‌లోకి విడుదలైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ ఔషధాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు అందజేశారు. ఆయన వీటిని వివిధ ఆసుపత్రులకు పంపిణీ చేశారు. మొత్తం 10 వేల డోసులు పంపిణీ చేశారు. పొడి రూపంలో ఉన్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుందని డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి.

అయితే, ఈ ఔషధం రెండో విడత పంపిణీ ఈ నెల 27న చేపడతామని డీఆర్‌డీఓ ఛైర్మన్‌ సతీశ్‌ రెడ్డి తెలిపారు. అది కూడా కొద్ది పరిమాణంలోనే ఉంటుందని పేర్కొన్నారు. రెగ్యులర్‌ ఉత్పత్తి జూన్‌ తొలి వారంలో ప్రారంభమవుతుందని తెలిపారు. అప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఔషధం అందుబాటులోకి వస్తుందన్నారు.  

ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ సహకారంతో డీఆర్‌డీవో 2డీజీ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. దీని వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) ఇటీవలే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది. కరోనా బాధితులు వేగంగా కోలుకోవడానికి ఇది సహకరిస్తుందని, కృత్రిమ ఆక్సిజన్‌ అవసరాన్ని తగ్గిస్తోందని డీఆర్‌డీవో తెలిపింది.

More Telugu News