Atchannaidu: అలా చేసుంటే.. తిరుప‌తి రుయా ఆసుపత్రి శ‌వాల దిబ్బ‌గా మారేది కాదు: అచ్చెన్నాయుడు

  • టీడీపీ నేత‌ల్ని అక్ర‌మంగా అరెస్టులు చేయిస్తున్నారు
  • వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు
  • దానిపై పెట్టిన శ్ర‌ద్ధ‌లో ఒక్క శాతం కొవిడ్ రోగులపై పెడితే బాగుండేది
  • వేలాది మంది కొవిడ్‌తో చ‌నిపోయే వారు కాదు
atchannaidu slams jagan

తిరుపతి రుయా ఆసుపత్రిలో నిన్న‌ ఆక్సిజన్‌ అందక 11 మంది రోగులు  ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ప్రాణవాయువు అందక త‌మ క‌ళ్ల ముందే త‌మ కుటుంబ స‌భ్యులు గిల‌గిలాకొట్టుకుంటూ ప్రాణాలు విడిచిపెట్ట‌డంతో బంధువులు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.  

'టీడీపీ నేత‌ల్ని అక్ర‌మంగా అరెస్టులు చేస్తూ, వారి ఆస్తులను ధ్వంసం చేయిస్తున్న దానిపై పెట్టిన శ్ర‌ద్ధ‌లో ఒక్క శాతం కొవిడ్ రోగుల సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై పెట్టినా రాష్ట్రంలో ఈ రోజు వేలాది మంది కొవిడ్‌తో చ‌నిపోయే వారు కాదు. తిరుప‌తి రుయా ఆసుపత్రి శ‌వాల దిబ్బ‌గా మారేది కాదు' అని అచ్చెన్నాయుడు విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రాజీనామా చేయాల‌ని ఆయ‌న హ్యాష్ ట్యాగ్ జోడించారు.  

More Telugu News