విశాఖకు ఆక్సిజన్ ట్యాంకర్లు మోసుకొచ్చిన ఐరావత్ నౌక
- ఈ నెల 5న సింగపూర్ నుంచి బయలుదేరిన నౌక
- అత్యవసర ఔషధాలు, ఆక్సిజన్ ట్యాంకర్లు
- సముద్రసేతు-2 కార్యక్రమంలో 9 నౌకలు
దేశంలో కరోనాతో అల్లాడుతున్న వారిని రక్షించేందుకు తూర్పు నావికాదళం సముద్రసేతు-2 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా 9 నౌకలు వివిధ దేశాలకు తరలివెళ్లాయి. అందులో ఐరావత్ ఒకటి. వివిధ దేశాల నుంచి సేకరించిన ద్రవ ఆక్సిజన్, కొవిడ్ ఔషధాలను సేకరించి భారత్ కు తరలిస్తున్నారు.