Kudipudi Chittabbai: వైసీపీ నేత కుడిపూడి చిట్టబ్బాయి హఠాన్మరణం!

  • బీసీల నేతగా పేరు తెచ్చుకున్నచిట్టబ్బాయి
  • కొన్ని రోజుల క్రితం సోకిన కరోనా మహమ్మారి
  • చికిత్స పొందుతూ కన్నుమూత
ysrcp Leader Kudipudi Passes Away

మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, బీసీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్న పేరు తెచ్చుకున్న కుడిపూడి చిట్టబ్బాయి, ఈ ఉదయం హఠాన్మరణం చెందారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా సోకగా, అప్పటి నుంచి కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి, ఆయన కన్ను మూశారు.

ఆయన మృతితో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, వైసీపీ కోనసీమలో ఓ సమర్థవంతమైన నేతను కోల్పోయిందని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఆయన కుటుంబీకులను ఫోన్ లో పరామర్శించిన జగన్, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసాను ఇచ్చారు. చిట్టబ్బాయి మృతి పట్ల పలువురు నేతలు, ప్రముఖులు సంతాపాన్ని వెలిబుచ్చారు.

More Telugu News