Pawan Kalyan: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ భార్య మృతి ప‌ట్ల ప్ర‌ముఖుల సంతాపం

  • వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి: కేసీఆర్
  • దిగ్భ్రాంతికి గుర‌య్యాను: ప‌వ‌న్ క‌ల్యాణ్  
  • వారి ఆత్మకు శాంతి కలగాలి: బ‌ండి సంజ‌య్
  • నా ప్రగాఢ సంతాపం: నారా లోకేశ్
pawan bandi sanjay mourn kanakadurgas death

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ భార్య కనకదుర్గ అనారోగ్యంతో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. ఆమె మృతి ప‌ట్ల‌ పలువురు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు.

'ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వేమూరి రాధాకృష్ణ సతీమణి, శ్రీమతి వేమూరి కనకదుర్గ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు' అని తెలంగాణ సీఎంవో ట్విట్ట‌ర్ లో పేర్కొంది.

క‌న‌క‌దుర్గ తుదిశ్వాస విడిచార‌ని తెలిసి దిగ్భ్రాంతికి గుర‌య్యానని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థిస్తున్నాన‌ని చెప్పారు. రాధాకృష్ణ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాన‌ని అన్నారు. ఈ విషాదాన్ని త‌ట్టుకునే మ‌నో ధైర్యాన్ని ఆ కుటుంబానికి ఇవ్వాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాన‌ని పేర్కొన్నారు.  

'ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ గారి సతీమణి వేమూరి కనకదుర్గ గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆంధ్రజ్యోతి సంస్థకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న కనకదుర్గ గారు కొద్దిరోజులుగా అనార్యోగంతో ఉంటూ మరణించడం తీవ్రంగా బాధించింది' అని బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ట్వీట్ చేశారు.

'ఆంధ్రజ్యోతి సంస్థ అభివృద్ధిలో వారి పాత్ర కీలకమైంది. వేమూరి రాధాకృష్ణ గారికి చేదోడుగా ఉన్న వ్యక్తి మరణం, సంస్థకు మరియు వ్యక్తిగతంగా రాధాకృష్ణ గారికి వారి కుటుంబసభ్యులకు తీరని లోటు' అని బండి సంజ‌య్ ట్వీట్ చేశారు.

'శ్రీమతి వేమూరి కనకదుర్గ గారి మరణం పట్ల సంతాపం తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలిగించాలని భగవంతున్ని ప్రార్థిస్తూ, రాధాకృష్ణ గారి కుటుంబం ధైర్యంగా ఉండాలని వారికి మనోనిబ్బరం కలిగించేలా శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను' అని బండి సంజ‌య్ పేర్కొన్నారు.

'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ గారి సతీమణి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ కనకదుర్గ గారి మృతితో దిగ్భ్రాంతికి గురయ్యాను. బ్యాంకు అధికారిణిగా పనిచేసి, సంస్థ నిర్వహణ బాధ్యతలలో తనదైన ముద్ర వేశారు. కనకదుర్గ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, రాధాకృష్ణ గారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను' అని టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

'ఏబీఎన్, ఆంధ్రజ్యోతి  సంస్థల  ఎండీ వేమూరి రాధాకృష్ణ గారి సతీమణి శ్రీమతి కనకదుర్గ గారి మృతి బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ.. రాధాకృష్ణ గారికి, వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నాను' అని టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ట్వీట్ చేశారు.

'మాకు అత్యంత ఆప్తులు వేమూరి రాధాకృష్ణ గారి సతీమణి శ్రీమతి కనకదుర్గ గారి మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను' అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.  

'ఆంధ్రజ్యోతి సంస్థల ఏండి వేమూరి రాధాకృష్ణ గారి సతీమణి శ్రీమతి వేమూరి కనకదుర్గ గారి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికరం. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను' అని బీజేపీ నేత సీఎం ర‌మేశ్ ట్వీట్ చేశారు.

'ఆంధ్రజ్యోతి సంస్థల ఏండి వేమూరి రాధాకృష్ణ గారి సతీమణి శ్రీమతి వేమూరి కనకదుర్గ గారి ఆకస్మిక మరణం దిగ్భ్రాంతికరం. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను' అని సినీ నిర్మాత బండ్ల గ‌ణేశ్ ట్వీట్ చేశారు.





More Telugu News