Corona Virus: దేశంలో కొత్త‌గా 1,61,736 మందికి కరోనా

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,36,89,453  
  • మృతుల సంఖ్య 1,71,058  
  • 10,85,33,085 మందికి వ్యాక్సిన్లు  
  • మొత్తం 25,92,07,108 కరోనా పరీక్షలు  
Media Bulletin on status of positive cases COVID19 in india

దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోంది. నిన్న కొత్త‌గా 1,61,736 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 97,168 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,36,89,453 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 879 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,71,058కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,22,53,697 మంది కోలుకున్నారు. 12,64,698 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 10,85,33,085 మందికి వ్యాక్సిన్లు వేశారు.
      
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 25,92,07,108 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న  14,00,122  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News