Corona Virus: దేశంలో కొత్త‌గా 93,249 మందికి కరోనా

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,24,85,509
  • మృతుల సంఖ్య 1,64,623
  • 7,59,79,651 మందికి వ్యాక్సిన్లు  
  • మొత్తం 24,81,25,908 కరోనా పరీక్షలు
 India reports  93249  new COVID19 cases

దేశంలో క‌రోనా విజృంభ‌ణ రోజురోజుకీ ఉద్ధృత‌మ‌వుతోంది. గ‌త 24 గంటల్లో 93,249 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 60,048 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,24,85,509కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 513 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,64,623 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,16,29,289 మంది కోలుకున్నారు. 6,91,597 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 7,59,79,651 మందికి వ్యాక్సిన్లు వేశారు.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 24,81,25,908 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 11,66,716 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News