మిఠాయి దుకాణంలో మోదీ, దీదీ... ఎన్నికల వేళ వినూత్న రీతిలో వ్యాపారం

Modi and Mamata idols made off sweets in a Howrah sweet shop
  • పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు
  • వాడీవేడిగా ప్రచారం
  • స్వీట్స్ తో మోదీ, మమత విగ్రహాలు
  • ప్రజలను ఓటు వేసేలా ప్రోత్సహిస్తామన్న దుకాణదారు
పశ్చిమ బెంగాల్ లో ఇప్పటివరకు రెండు విడతల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా 6 విడతల ఎన్నికలు జరగాల్సి ఉంది. పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం మమతా బెనర్జీ ఢీ అంటే ఢీ అనేలా మాటల యుద్ధం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హౌరాలోని ఓ స్వీట్ షాపులో ఆసక్తికర దృశ్యం కనిపించింది. మోదీ, మమతల విగ్రహాలతో పాటు సంజక్తా మోర్చా నేతల తలలతో కూడిన మరో విగ్రహం ఆ మిఠాయి దుకాణంలో దర్శనమిచ్చాయి. ఆ విగ్రహాలను మిఠాయి పదార్థాలతో చేయడం విశేషం.

దీనిపై ఆ దుకాణదారు స్పందిస్తూ, ఆర్నెల్ల వరకు ఈ మిఠాయిలు చెడిపోవని తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా తమ స్వీట్ విగ్రహాలు ప్రోత్సహిస్తాయని భావిస్తున్నామని చెప్పారు. ఏదేమైనా ఈ తియ్యని విగ్రహాలు ఆ మిఠాయి దుకాణానికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. కాగా మమత బొమ్మను మాత్రం వీల్ చెయిర్ లో ఉన్నట్టుగానే తయారు చేశారు.
Go Back to Shorts
Narendra Modi
Mamata Banerjee
Sweet Shop
Idols
Howarah
West Bengal

More Telugu News