ఏపీలో కరోనా ప్రమాద ఘంటికలు... ఒక్కరోజులో 9 మంది మృతి
- ఏపీలో తీవ్రరూపం దాల్చుతున్న కొవిడ్
- 7,234కి పెరిగిన కరోనా మరణాల సంఖ్య
- గత 24 గంటల్లో 31,260 కరోనా పరీక్షలు
- 1,398 మందికి పాజిటివ్
- గుంటూరు జిల్లాలో 273 కేసులు
అటు, గత 24 గంటల్లో 31,260 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,398 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 273 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో 198, చిత్తూరు జిల్లాలో 190, కృష్ణా జిల్లాలో 178, నెల్లూరు జిల్లాలో 163 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 787 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఏపీలో ఇప్పటివరకు 9,05,946 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,89,295 మంది కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,417 మంది చికిత్స పొందుతున్నారు.