Chiranjeevi: చిరంజీవి కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు?

  • 'ఆచార్య'ను పూర్తిచేసే పనిలో చిరంజీవి
  • అనంతరం సెట్స్ పైకి 'లూసిఫర్' రీమేక్
  • బాబీ దర్శకత్వంలో గ్రామీణ కథాచిత్రం 
  • 'వీరయ్య' అనే టైటిల్ పెట్టినట్టు ప్రచారం     
Title confirmed for Chiranjeevi new movie

యంగ్ హీరోలకు దీటుగా చిరంజీవి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా పట్టాలెక్కిస్తున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న 'ఆచార్య' చిత్రాన్ని పూర్తిచేసే పనిలో బిజీగా వున్నారు. ఇక దీని తర్వాత మరో మూడు సినిమాలు ఇప్పటికే ఓకే అయ్యాయి. వీటిలో మలయాళ హిట్ చిత్రం 'లూసిఫర్' ఒకటి. దీనికి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తారు. 'ఆచార్య' తర్వాత ఇదే ముందుగా సెట్స్ కి వెళుతుంది.

ఇక ఆ తర్వాత ఆయన మరో రెండు సినిమాలు చేయాల్సి వుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'వేదాళం' తమిళ చిత్రం రీమేక్ ఒకటి కాగా.. బాబీ దర్శకత్వంలో రూపొందే చిత్రం మరొకటి. అయితే, వీటిలో బాబీ సినిమానే ముందుగా సెట్స్ కి వెళుతుందని అంటున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతుందని తెలుస్తోంది. దీని కోసం హీరో పాత్రను బట్టి ఈ చిత్రానికి 'వీరయ్య' అనే టైటిల్ని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. మరి, ఇందులో వాస్తవం ఎంతన్నది త్వరలో వెల్లడవుతుంది.

More Telugu News