painting: రూ.450 కోట్లకు అమ్ముడుపోయిన పెయింటింగ్ ఇది!

Artwork from worlds largest canvas painting
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్  ఇది. దీన్ని తాజాగా దుబాయ్‌లో వేలం వేయ‌గా దాదాపు రూ.450 కోట్ల‌కు ( 62 మిలియన్ డాల‌ర్లకు) అమ్ముడుపోయింది.  'ద జర్నీ ఆఫ్ హ్యుమనిటీ' పేరిట  బ్రిటిష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ ఈ పెయింటింగ్‌ను వేశాడు. ఇందుకోసం 1,065 పెయింట్ బ్రష్‌లు, 6,300 లీటర్ల పెయింట్స్ ను ఆయ‌న వాడాడు.

దుబాయ్‌లోని అట్లాంటీస్ హోటల్‌లో  సుమారు ఏడు నెలల పాటు  కష్టపడి ఆయ‌న‌ ఈ పెయింటింగ్ వేశాడు. కరోనా విజృంభ‌ణ స‌మ‌యంలో త‌న స‌మ‌యాన్ని ఈ పెయింటింగ్ కోస‌మే వినియోగించి‌న‌ట్లు ఆయ‌న తెలిపాడు.

70 ముక్కలుగా వేసిన‌ ఈ పెయింటింగ్ ను వేలంలో ఫ్రెంచ్‌కు చెందిన ఆండ్రీ అబ్దున్ అనే వ్యక్తి దక్కించుకున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ అయిన 'ద జర్నీ ఆఫ్ హ్యుమనిటీ గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది.
Go Back to Shorts
painting
dubai

More Telugu News