Nalgonda District: ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో తీన్మార్ మల్లన్న ఓటమి నేప‌థ్యంలో యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

  • మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానం నుంచి మ‌ల్ల‌న్న పోటీ
  • ఇటీవ‌ల మ‌ల్ల‌న్నతో క‌లిసి న‌ల్ల‌గొండ యువ‌కుడు ప్ర‌చారం
  • మ‌ల్ల‌న్న ఓట‌మితో పురుగుల మందు తాగిన శ్రీ‌శైలం
  • క‌ల‌త చెందాన‌న్న మ‌ల్ల‌న్న‌
nalgonda man commits suicide

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్య‌ర్థి సురభి వాణీదేవి విజయం సాధించగా,  నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలిచిన విష‌యం తెలిసిందే. నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానం నుంచి ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డికి గ‌ట్టిపోటీనిచ్చిన స్వ‌తంత్ర అభ్య‌ర్థి తీన్మార్ మ‌ల్ల‌న్న రెండో స్థానానికే ప‌రిమిత‌మ‌య్యారు.

ఈ ఎన్నిక‌ల్లో తీన్మార్ మల్లన్న ఓటమి నేప‌థ్యంలో ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. న‌ల్ల‌గొండ జిల్లా మర్రిగూడ మండలం, లంకలపల్లికి చెందిన శ్రీ‌శైలం అనే‌ ఓ యువకుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు మ‌ద్ద‌తుగా ఇటీవ‌ల ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నాడు. తీన్మార్ మల్లన్న ఓడిపోయార‌ని తెలుసుకుని మ‌న‌స్తాపం చెందాడు. ఈ రోజు ఉద‌యం శ్రీ‌శైలం పురుగులమందు తాగాడు. శ్రీ‌శైలం కుటుంబ సభ్యులు ఈ విష‌యాన్ని గుర్తించి ఆయ‌న‌ను నల్ల‌గొండ ఆసుప‌త్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

శ్రీశైలం తనతోపాటు పాదయాత్రలో పాల్గొన్నాడని తీన్మార్ మ‌ల్ల‌న్న అన్నారు. రాష్ట్రంలో మార్పు కోసం త‌న‌తో పాటు కృషి చేసిన శ్రీ‌శైలం ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ప‌ట్ల క‌ల‌త చెందాన‌ని చెప్పారు. ఇలాంటి ప్రయత్నాలు ఎవ్వ‌రూ చేయవద్దని మల్లన్న కోరారు. ఆత్మ‌హ‌త్య‌ చేసుకోవాల్సింది మనంకాదని, ప్రజలకు దూరంగా ఉన్న రాజకీయపార్టీలు ఆ ప‌ని చేయాల‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.


More Telugu News