8 నెలల తర్వాత భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వరుడు
- గతేడాది జులై 19న చివరిసారి దర్శనం
- శ్రీశైల జలాశయ నీటిమట్టం 839 అడుగులకు చేరుకోవడంతో ఆలయ దర్శనం
- రేపటి నుంచి పూర్తిస్థాయిలో పూజలు
వేపదారు శివలింగం మాత్రం అడుగు మేర నీటిలోనే ఉండిపోయింది. జలాశయ నీటిమట్టం మరో అడుగు తగ్గితే శివలింగం పూర్తిగా దర్శనమిస్తుంది. ఆలయం బయటకు రావడంతో పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. రేపటి నుంచి ఆలయంలో పూర్తిస్థాయిలో పూజలు జరిగే అవకాశం ఉందని పూజారులు తెలిపారు.