Kurnool District: కరోనా కలకలం.. కర్నూలు జిల్లాలో పాఠశాల మూసివేత!

  • పత్తికొండలోని ప్రైవేటు పాఠశాలలో కరోనా కలకలం
  • ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్
  • పాఠశాలను మూసివేస్తున్నట్టు ప్రకటన 
School closed in Kurnool district after two students tests Corona positive

ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో కలకలం రేగింది. పత్తికొండలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. రెండు రోజుల క్రితం వీరిద్దరిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో, నిన్న వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. ఈ టెస్టుల్లో వారికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

దీంతో, పాఠశాలను మూసివేశారు. ఈరోజు నుంచి స్కూలును మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ పాఠశాలలో 400 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. మరోవైపు ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడటంతో... ఆ స్కూల్లో చదువుతున్న ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

More Telugu News