Sharmila: వివేకానంద రెడ్డి వ‌ర్థంతి కార్యక్రమం.. కూతురు సునీత‌తో క‌లిసి పాల్గొన్న విజ‌య‌మ్మ‌, షర్మిల‌

  • పులివెందులలో వ‌ర్థంతి కార్య‌క్ర‌మం
  • వివేకాఘాట్ వ‌ద్ద వైఎస్ కుటుంబ స‌భ్యుల నివాళులు
  • చ‌ర్చ‌నీయాంశంగా మారిన ష‌ర్మిల పులివెందుల ప‌ర్య‌ట‌న
sharmila presents in viveka death anniversary program

క‌డ‌ప జిల్లా పులివెందులలో ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. పులివెందుల‌లో వివేకాఘాట్ వ‌ద్ద వైఎస్ కుటుంబ స‌భ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో వివేకానంద‌రెడ్డి కుమార్తె సునీత‌తో పాటు వైఎస్ విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల కూడా పాల్గొన్నారు.

తెలంగాణ ష‌ర్మిల‌ కొత్త పార్టీ పెట్ట‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. వ‌చ్చేనెల‌లోనే పార్టీ పేరు ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల పులివెందుల‌లో ప‌ర్య‌టిస్తుండ‌డం ప‌ట్ల ప‌లు ఊహాగానాలు వ‌స్తున్నాయి. కాగా, వివేకానందరెడ్డి 2019, మార్చి 15న పులివెందులలోని తన  ఇంట్లో అనుమానాస్పద రీతిలో మరణించగా దానిపై విచార‌ణ కొన‌సాగుతోంది.

More Telugu News