నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
- బడ్జెట్ ను ఆమోదించేందుకు సమావేశం కానున్న ఉభయసభలు
- నేడు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం
- తొలిరోజు కేవలం గవర్నర్ ప్రసంగంతో సరి
- మరుసటి రోజు నుంచి సమావేశాలు
- అజెండా నిర్ణయించనున్న బీఏసీ కమిటీలు
కాగా తొలిరోజు సమావేశాలు గవర్నర్ ప్రసంగం అనంతరం మరుసటిరోజుకు వాయిదాపడనున్నాయి! ఇక సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ, మండలి బీఏసీ కమిటీలు బడ్జెట్ సమావేశాల తీరుతెన్నులపై చర్చించి అజెండాను నిర్ణయించనున్నాయి. ఈ నెల 16న దివంగత సభ్యులకు సంతాపం తీర్మానం, ఈ నెల 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు తీర్మానంపై చర్చ జరగనుంది. వార్షిక బడ్జెట్ ను ఈ నెల 18న ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో అన్ని ప్రోటోకాల్ చర్యలను తప్పనిసరి చేశారు.