Devisri Prasad: సరికొత్త టీవీ షోతో వస్తున్న దేవిశ్రీ ప్రసాద్

  • పలు సినిమాలతో బిజీగా వున్న దేవిశ్రీ 
  • 'జీ తమిళ్' ఛానెల్ కోసం చేస్తున్న షో
  • 'స్టార్ టు రాక్ స్టార్' పేరుతో టీవీ షో 
  • ప్రోమో విడుదల చేసిన టీవీ ఛానెల్   
Devisri Prasad to perform in a TV show

ప్రస్తుతం తెలుగులో అగ్రశ్రేణి సంగీత దర్శకులుగా రాణిస్తున్న అతికొద్ది మందిలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. పలు సినిమాలతో ఎప్పుడూ ఆయన బిజీగా ఉంటాడు. ముఖ్యంగా స్టార్ హీరోలు, ప్రముఖ దర్శకులు దేవిశ్రీని కోరుకుంటూవుంటారు. అందుకు తగ్గట్టుగానే ఆయా హీరోల ఇమేజ్ ను పెంచే విధంగా ఆయన మంచి హిట్ ట్యూన్స్ ఇస్తుంటాడు. ఓపక్క సినిమాలతో ఇంతటి బిజీగా ఉంటూనే.. మరోపక్క దేవిశ్రీ తాజాగా ఓ టీవీ షో చేయడానికి రెడీ అవుతున్నాడు.

'జీ తమిళ్' ఛానెల్ కోసం ఆయన ఈ టీవీ షోను చేస్తున్నాడు. దీని పేరు 'స్టార్ టు రాక్ స్టార్'. దీనికి సంబంధించిన ప్రోమోను ఈ రోజు సదరు ఛానెల్ విడుదల చేసింది. మామూలుగా దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ షోలలో మంచి ఎనర్జీతో అదరగొడుతుంటాడు. మరి, త్వరలో ప్రసారం కానున్న ఈ టీవీ షోతో ఎంతటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి!  

More Telugu News