Corona Virus: కొత్త స్ట్రెయిన్ వల్ల బ్రెజిల్ లో పెరిగిన మరణాలు

Corona deaths increased in Brazil due to new strain
  • బ్రెజిల్ లో నిన్న ఒక్క రోజే 2,286 మంది మృతి
  • అమెరికాను దాటేసిన బ్రెజిల్
  • ప్రతి 20 నిమిషాలకు వెయ్యి మందికి కరోనా
బ్రెజిల్ ను కరోనా మహమ్మారి వణికిస్తోంది. నిన్న ఒక్క రోజే ఆ దేశంలో ఏకంగా 2,286 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే ప్రథమం. మరణాల విషయంలో అమెరికాను బ్రెజిల్ దాటేసింది. గత వారం రోజులుగా బ్రెజిల్ లో సగటున రోజుకు 1,573 మంది మృతి చెందుతుండగా... అమెరికాలో ఈ సంఖ్య 1,566గా ఉంది.

ప్రతిరోజు బ్రెజిల్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గత వారం డేటాను పరిశీలిస్తే... సగటున ప్రతి 20 నిమిషాలకు వెయ్యి మంది మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో, బ్రెజిల్ వైద్యాధికారులు మాట్లాడుతూ కొత్త స్ట్రెయిన్ కారణంగానే మరణాల సంఖ్య పెరిగిందని చెప్పారు. బ్రెజిల్ లో ఇప్పటి వరకు 1.12 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటి వరకు 2.70 మంది మృతి చెందారు.

More Telugu News

Corona Virus
Brazil
Deaths