Corona Virus: తెలంగాణలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

  • కొత్త‌గా 111 కరోనా కేసులు
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,011
  • మృతుల సంఖ్య 1,642
  • జీహెచ్ఎంసీలో కొత్త‌గా 27 క‌రోనా కేసులు  
Media Bulletin on status of positive cases COVID19 in Telangana

తెలంగాణలో కొత్త‌గా 111 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 189 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,011కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,96,562 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,642 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,807 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 689 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్త‌గా 27 క‌రోనా కేసులు నమోద‌య్యాయి.

   

More Telugu News