Corona Virus: భార‌త్‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

  • 24 గంటల్లో 18,711 మందికి కరోనా నిర్ధారణ
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,12,10,799
  • మృతుల సంఖ్య 1,57,756
  • 2,09,22,344 మందికి వ్యాక్సిన్  
India reports 18711 new COVID19 cases

భార‌త్‌లో గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, 14,392 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  1,12,10,799కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 100 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,756 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,68,520 మంది కోలుకున్నారు. 1,84,523 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 2,09,22,344 మందికి వ్యాక్సిన్ వేశారు.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,14,30,507 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,37,830 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News