Corona Virus: దేశంలో కొత్త‌గా 18,327 మందికి కరోనా నిర్ధారణ

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,92,088
  • మృతుల సంఖ్య 1,57,656
  • 1,94,97,704 మందికి వ్యాక్సిన్
  • 22,06,92,677 కరోనా పరీక్షలు  
18327 New Coronavirus Cases In India

భార‌త్‌లో గత 24 గంటల్లో 18,327 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, 14,234 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,92,088కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 108 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,656కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,54,128 మంది కోలుకున్నారు. 1,80,304 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,94,97,704 మందికి వ్యాక్సిన్ వేశారు.
   
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,06,92,677 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,51,935 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News