త్వరలోనే హనుమాన్ నామ సంకీర్తన చేపడతాం: కల్వకుంట్ల కవిత
- కొండగట్టు అంజన్న సన్నిధిలో ఎమ్మెల్సీ కవిత
- ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు
- దేవాలయాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామన్న కవిత
- ఆలయాలకు బడ్జెట్ కేటాయించింది తమ ప్రభుత్వమేనని వెల్లడి
త్వరలోనే హనుమాన్ నామ సంకీర్తన చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. దేవాలయాల కోసం బడ్జెట్ కేటాయించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే సొంతమని అన్నారు. కాగా, కవిత కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సమయంలో ఆమె వెంట రాష్ట్ర ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తదితరులు ఉన్నారు.