India: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు!

India reports 13742 new COVID19 cases
  • గత 24 గంటల్లో 13,742 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,30,176
  • మృతుల సంఖ్య 1,56,567
  • 1,21,65,598  మందికి వ్యాక్సిన్
దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 13,742 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 14,037 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,30,176 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 104 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,567 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,26,702 మంది కోలుకున్నారు. 1,46,907 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,21,65,598  మందికి వ్యాక్సిన్ వేశారు.
     
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,30,36,275 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,05,844 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
India
Corona Virus
COVID19

More Telugu News