Corona Virus: దేశంలో క‌రోనా కేసుల తాజా వివ‌రాలు!

  • 24 గంటల్లో 10,584 మందికి కరోనా
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,16,434
  • మృతుల సంఖ్య 1,56,463
  • 1,17,45,552 మందికి వ్యాక్సిన్  
India reports 10584 new COVID19 cases

దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 10,584 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 13,255 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,16,434కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 78 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,463 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,12,665 మంది కోలుకున్నారు. 1,47,306 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,17,45,552 మందికి వ్యాక్సిన్ వేశారు.
      
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,22,30,431 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,78,685 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News