టీడీపీ తరఫున గెలిచిన 42 శాతం మంది ఎవరో చంద్రబాబు చెప్పగలరా?: కొడాలి నాని
- ఏపీలో ముగిసిన పంచాయతీ ఎన్నికలు
- ప్రజలు తమకు బ్రహ్మరథం పట్టారన్న కొడాలి నాని
- మున్సిపల్ ఎన్నికల్లోనూ తమదే హవా అని వెల్లడి
- చంద్రబాబు పిచ్చెక్కి మాట్లాడుతున్నాడని విమర్శలు
- చంద్రబాబును పిచ్చాసుపత్రిలో చేర్చాలంటూ వ్యాఖ్యలు
పిచ్చి పట్టిన చంద్రబాబు ఇప్పటికే తెలంగాణలో పార్టీని నాశనం చేశాడని, చంద్రబాబును ఇకనైనా మెంటల్ ఆసుపత్రిలో చేర్చకపోతే ఏపీలోనూ టీడీపీకి అదేగతి పడుతుందని అన్నారు. చంద్రబాబు జూమ్ యాప్ లో కూర్చుని పగటి కలలు కంటున్నాడని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పార్టీ గుర్తులు ఉండవని, అలాంటి ఎన్నికల్లోనే తమకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇక పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదని నాని ధీమా వ్యక్తం చేశారు.