తిరుపతిలో కొవిడ్ టీకా తీసుకున్న పారిశుద్ధ్య కార్మికుడి మృతి
- మొన్న టీకా తీసుకున్న పారిశుద్ధ్య కార్మికుడు కృష్ణయ్య
- నిన్న కళ్లు తిరిగి కిందపడి మరణించిన వైనం
- బీపీ, షుగర్ ఉన్నా టీకా వేశారంటున్న కుమారుడు
కృష్ణయ్య మరణంపై అతడి కుమారుడు తిరుమల మాట్లాడుతూ.. తన తండ్రికి అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నాయని, అయినప్పటికీ టీకా వేశారని ఆరోపించారు. పోస్టుమార్టం అనంతరం కృష్ణయ్య మృతికి కారణం తెలుస్తుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య తెలిపారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పేర్కొన్నారు.