anasuya: నెటిజ‌న్‌పై మండిప‌డ్డ యాంక‌ర్ అన‌సూయ‌!

  • మూడేళ్ల క్రితం ఓ షోలో పాల్గొన్న అను
  • యాంక‌రింగ్ చేస్తూ క‌ళ్లు తిరిగి ప‌డిపోయిన వైనం
  • ప‌బ్లిసిటీ కోస‌మే అలా చేసిందని తాజాగా నెటిజ‌న్ ట్వీట్
  • తానూ దూషించ‌గ‌ల‌న‌ని అన‌సూయ ఘాటు రిప్లై
  • కానీ త‌న త‌ల్లిదండ్రులు అలా పెంచ‌లేద‌ని వ్యాఖ్య  
anasuya slams netizen

ఓ నెటిజ‌న్‌పై యాంక‌ర్ అన‌సూయ‌ మండిప‌డుతూ ట్వీట్లు చేసింది. దాదాపు మూడేళ్ల క్రితం అన‌సూయ‌ ఓ షోలో యాంక‌రింగ్ చేస్తూ క‌ళ్లు తిరిగి ప‌డిపోయింది. దానికి సంబంధించిన ఫొటోలను ఓ నెటిజన్‌ ట్విట్ట‌ర్‌‌లో పోస్ట్ చేస్తూ ప‌లు ఆరోప‌ణ‌లు చేశాడు. ఈ షో ప‌బ్లిసిటీ కోస‌మే అనసూయ అలా కళ్లు తిరిగిపడిపోయిన‌ట్లు న‌టించింద‌ని చెబుతూ అస‌భ్యక‌రంగా ఓ కామెంట్ చేశాడు.  

దాన్ని చూసిన అన‌సూయ‌కు చిర్రెత్తుకొచ్చింది. ఆమె కూడా అస‌భ్య‌ప‌ద‌జాలం వాడుతూ అత‌డిని తిడుతూ పోస్ట్ చేసింది.  ఇటువంటి కామెంట్‌ చేయడం చాలా తేలిక‌ని చెప్పింది. త‌న‌కు లోబీపీ ఉందని, అప్ప‌ట్లో తాను 22 గంటలపాటు నిర్విరామంగా షూట్‌లో పాల్గొన్నాన‌ని చెప్పింది.

తెల్ల‌వారుజామున 5.30 గంట‌ల‌కు ఆ ఘ‌ట‌న జ‌రిగింద‌ని వివ‌రించింది. దానిని వేరేలా అర్థం చేసుకుంటున్నారని, ఏం జరిగిందో పూర్తిగా తెలియకుండానే త‌నపై ఎలా కామెంట్‌ చేస్తావు? అంటూ ఆ నెటిజ‌న్ ను అనసూయ నిల‌దీసింది.

త‌న‌ను అసభ్యంగా దూషించాలనే ఉద్దేశంతోనే ఉద్దేశ‌పూర్వ‌కంగా మూడేళ్ల క్రితం వీడియో చూసి ఇలా కామెంట్‌ చేస్తున్నావా? అని ప్ర‌శ్నించింది. తాను కూడా ఎలాంటి సిగ్గు, భయం లేకుండా దూషించ‌గ‌ల‌న‌ని, అయితే, త‌న‌ను త‌న‌ తల్లిదండ్రులు అలా పెంచలేదని చెప్పుకొచ్చింది.

More Telugu News