టెన్నిస్ దిగ్గజం అక్తర్ అలీ కన్నుమూత.. మమతా బెనర్జీ సంతాపం
- మూత్ర సంబంధ సమస్యలతో బాధపడుతూ మృతి
- ఎంతోమందిని టెన్నిస్ చాంపియన్లుగా తీర్చిదిద్దిన అలీ
- ఆయనను అత్యున్నత క్రీడా పురస్కారంతో సత్కరించామన్న మమతా బెనర్జీ
అక్తర్ అలీ మృతికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. అక్తర్ సర్ ఎంతోమందిని టెన్నిస్ చాంపియన్లుగా తీర్చిదిద్దారని కొనియాడారు. 2015లో బెంగాల్ ప్రభుత్వం తరపు అత్యున్నత క్రీడా పురస్కారంతో ఆయనను గౌరవించినట్టు గుర్తు చేశారు. ఆయన ప్రేమాభిమానాలు తనకు లభించడం తన అదృష్టమన్న మమత.. అలీ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.