చికిత్సకు ఫీజు అడిగిన డాక్టర్.. ఆయన వేలు కొరికి చేతిలో పెట్టిన యువకుడు!
- మధ్యప్రదేశ్లోని చింద్వాడాలో ఘటన
- కాలిన చేతికి వైద్యం కోసం వచ్చిన బాధితుడు
- చికిత్స అనంతరం ఫీజు అడిగితే క్లినిక్ ధ్వంసం
- ఇద్దరు నిందితుల అరెస్ట్
డాక్టర్ బింద్రా వెంటనే అతడికి చికిత్స అందించారు. అనంతరం ఫీజు అడగ్గా బాధితుడితోపాటు, అతడి వెంట వచ్చిన వారు రెచ్చిపోయారు. క్లినిక్పైనే దాడికి యత్నించారు. అడ్డుకోబోయిన బింద్రా చేతి వేలిని బాధితుడితోపాటు వచ్చిన విజయ్ తివారీ అనే వ్యక్తి కొరికి చేతి నుంచి వేలిని వేరు చేశాడు. అనంతరం క్లినిక్లోని వస్తువులపై ప్రతాపం చూపించి వెళ్లిపోయారు. డాక్టర్ బింద్రా ఫిర్యాదు మేరకు ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.