Corona Virus: దేశంలో కొత్త‌గా 12,059 మందికి కరోనా

  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,26,363
  • మృతుల సంఖ్య 1,54,996
  • 57,75,322 మందికి వ్యాక్సిన్
India reports 12059 new COVID19 cases

దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 12,059 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 11,805 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,26,363 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 78 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,54,996 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,05,22,601 మంది కోలుకున్నారు. 1,48,766 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 57,75,322 మందికి వ్యాక్సిన్ వేశారు.
       
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 20,13,68,378 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 6,95,789 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

More Telugu News