టాస్ వేసి సర్పంచ్ అభ్యర్థిని ఎంపిక చేసిన గ్రామస్థులు!
- కడప జిల్లా వరికుంటలో టాస్
- తొలి రెండేళ్ల కాలాన్ని ఎంచుకున్న గెలిచిన అభ్యర్థి
- ఎన్నికలు జరుగుతాయన్న అధికారులు
జిల్లాలోని సోమశిల ముంపు ప్రభావిత మండలమైన అట్లూరులోని వరికుంట పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ జనరల్కు కేటాయించారు. ఒకే పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య పోటీ నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన స్థానిక నాయకులు బొమ్మాబొరుసు వేయాలని నిర్ణయించుకున్నారు.
ఇందులో గెలిచినవారు తొలుత రెండేళ్లు కానీ, చివరి మూడేళ్లు కానీ పదవిలో ఉండేందుకు అంగీకరించారు. దీంతో టాస్ వేయగా, గెలిచిన అభ్యర్థి తొలి రెండేళ్ల పదవీ కాలాన్ని ఎంచుకున్నాడు. అయితే, ఇక్కడ పోలింగ్ మాత్రం యథావిధిగానే జరుగుతుందని అధికారులు చెప్పడం గమనార్హం.